సఖినేటిపల్లి: డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవ ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేవస్థానంలో ముందుగా పూజలు నిర్వహించి, మేళతాళాలతో రథం షెడ్డు కు వెళ్లి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రథాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇకనుండి రథోత్సవం వరకు రథాన్న శుభ్రం చేయటం, అలంకరించడం వంటి పనులు చేపడుతారు. ఊరేగింపుకు రథాన్న సంసిద్ధం చేస్తా మనీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ఎం కే టి ఎన్ వి ప్రసాద్, ఎంపీటీసీ బైరా నాగరాజు, అర్చకులు, గ్రామ పెద్దలు, పల్లవపాలెం అగ్నికుల క్షత్రియులు పాల్గొన్నారు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం సిద్ధం
స్వామివారి రథయాత్రకు సిద్ధం చేయటానికి బయటకు తీసుకు వస్తున్న దృశ్యం