Telugu News Power

రొయ్యలు చేపల కూరతో అన్నదానం చేసి, మృగశిర కు ఆహ్వానం పలికిన ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: జూన్,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం,మార్టేరు కూడలి ప్రాంతాల్లో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రొయ్యలు చేపల కూరతో అలగాలని చేసి మృగశిర కార్తికి ఆహ్వానం పలికారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు ఆనందంగా విందు ఆరగించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, దేశంలోనే ఈ తరహా వినూతన కార్యక్రమం మొట్టమొదటిసారి ప్రారంభించినట్టు తెలిపారు….

Read More

సార్వాసాగుకు రైతులు సిద్ధపడాలి. -వ్యవసాయ అధికారుల సూచన

పాలకొల్లు: జూన్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం లో కాలువలు జూన్ ఒకటో తారీఖున గోదావరి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వం వారు తెలియజేశారు కావున రైతు సోదరులు అందరు కూడా జూన్ మొదటి వారంలో నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాము ఖరీఫ్ లో వరి రకాలు ఎంటియు 1318 ఎం టి యు 7029 అలాగే 12:93, 12 82, 1140,సంపద స్వర్ణ,ఈ వెరైటీలు అన్నీ కూడా సాగుకు అనుకూలము రైతు సోదరులు సమాయత్తమయి…

Read More

ఆక్వా రైతులను సీఎం ఆదుకోవాలి. -మాజీ ఎమ్మెల్సీ అంగర విజ్ఞప్తి

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడటానికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని, రైతులను ఆదుకోవాలని అంగర విజ్ఞప్తి…

Read More

రొయ్యలు, చేపలతో జూన్, 8న పేదలకు ఉచిత భోజనాలు. -పాలకొల్లు ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: మే, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దోపిడీ కోరల్లో చిక్కుకున్న రొయ్యల రైతులకు విముక్తి కలిగించడానికి వినూత్న పద్ధతులు అన్వేషిస్తున్నట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా, శనివారం పత్రికా సమావేశంలో మాట్లాడారు. రొయ్యలకు స్థానిక మార్కెట్లో డిమాండ్ సృష్టించటానికి ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ వార్డుల్లో, గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారులకు రొయ్యలు నిలవ చేసే ఫ్రిడ్జ్ లో…

Read More

అమలాపురంలో ఆక్వా రైతు సదస్సు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా ఈ నెల 29న అమలాపురంలో రొయ్యల రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్టు, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం తెలిపారు. రొయ్య సీడు నాణ్యత, ఫీడు ధరల పెంపు, రొయ్య ద్వారా తగ్గించటం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల రైతులను సమాయత్త పరచడానికి…

Read More

ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.

నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి…

Read More

ఆక్వా రైతుల సమస్యలపై ఈనెల 15 నుంచి కార్యాచరణ. -రాష్ట్ర సమావేశంలో నిర్ణయం.

పాలకొల్లు: మే, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 15 న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఆక్వా సంఘం నిర్ణయించింది. శ్రీ క్షీరా రామ జై భారత్ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన బుధవారం, పాలకొల్లులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్వహించారు. వనామి రొయ్యల ఫీడ్ ధర రూ.8 వేలు, టైగర్ రొయ్య ఫీడ్…

Read More

వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ.

పాలకొల్లు: ఏప్రిల్, 15(న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, పకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ అధికారి పి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, కోతల పూర్తయ్యాక వరి చేలో పచ్చిరొట్టపైరు విత్తనాలు చల్లాలని సూచించారు. ఇందుకు, నవధాన్యపు కిట్లను వేయాలని తెలిపారు. భూమి ఖాళీ ఉండకుండా, పచ్చి రోట్ట తో కప్పినట్లయితే భూమిలోని పోషకాల, సూక్ష్మజీవులు నష్టపోకుండా ఉంటాయన్నారు. ఈ పచ్చిరొట్ట ను…

Read More

వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం వెలివెల, ఆరట్లకట్ట గ్రామాల్లో ఆత్మ వారి సహకారం తో మంగళవారం రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. అగర్తి పాలెం లో వరి పాలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మారుటేరు శాస్త్ర వేత్తలు డాక్టర్ మల్లి కార్జునరావు మాట్లాడుతు వరి పంట పాలు పోసుకొనే దశ లో ఉన్నది ఉక్కబోత గా ఉంటుంది, కావున దోమ వచ్చే సూచన ఉంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం…

Read More

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలలి, రాష్ట్ర రైతు సదస్సు డిమాండ్.

వీరవాసరం: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్ . కామ్) సిండికేట్ల కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రొయ్యల రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయాలని పాలకొల్లు శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ గొట్టుముక్క గాంధీ భవన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు ఆదివారం వీరవాసరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సుకు పాలకొల్లు, ఆచంట, నరసాపురం తూర్పుగోదావరి, కృష్ణ తదితర జిల్లా…

Read More