Telugu News Power

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి.

హైదరాబాద్: ఏప్రిల్, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) బుధవారం కన్నుమూశారు. వయో భారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు నాదెండ్ల చికిత్స తీసుకుంటున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి వీరికి వైద్య సేవలు అందించారు. వీరి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం వద్ద బంధువులు, అభిమానల సందర్శనార్థం ఉంచారు. పంజాగుట్ట స్మశాన వాటికలో…

Read More

గాయపడ్డ ఉపాధ్యాయునికి ఎమ్మెల్సీ పరామర్శ.

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం,లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కుక్కల వెంకట రాజా సురేష్ మంగళవారం లంకలకోడేరు రైల్వేస్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని, తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు.భగ్గేశ్వరం గ్రామం వంతెన వద్దకు వచ్చేసరికి పూర్వ విద్యార్థి దారికాచి, ఆకస్మాత్తుగా దాడి చేసి తలపై ఇనుపరాడ్ తో కొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కుక్కల వెంకట రాజా…

Read More

యుటిఎఫ్ సంఘం లోకి భారీగా చేరికలు.

గణపవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) యుటిఎఫ్ శాఖలోకి నూతనంగా సభ్యత్వాన్ని తీసుకొని పలువురు ఉపాధ్యాయులు బుధవారం సంఘంలో చేరారు. సభ్యులుగా చల్లా కృష్ణ ,గంగరాజు మాస్టర్,మాకా ప్రసాద్,నక్క రాంబాబు,మద్దాల జగన్నాథ స్వామి, గొర్రెల దుర్గా ప్రసాద్, సభ్యత్వం స్వీకరించారు. వీరికి స్వాగతం పలుకుతూ, గణపవరం మండల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ లో…

Read More

జలవనురుల నిధులు రూ. 3 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ట, కొమ్ము చిక్కాల, కాపవరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అరట్లకట్టలో రూ. 50 లక్ష్యంతో సీసీ వాల్ నిర్మాణం, రూ. 20 లక్షలతో పైపు కల్వర్టు, గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్ముచిక్కాల లో రూ.75 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.31.29 లక్షలతో మరో సిసి వాళ్ళ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాపవరం…

Read More

పాలకొల్లుకు రూ. 5 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ కావాలి. కామ్) వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి ఆధునిక ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లులో ఏర్పాటు చేయనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, పట్టాభిపురం మంగళవారం పాలకొల్లులో ఎడ్ల బజారు వద్ద, సూర్య తేజ శివారుణ ఉన్న డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. వ్యర్ధాల నిర్వహణ ఎప్పటికీ చాలా వరకు పూర్తయిందని, ఇంకా 57,600 మెట్ ట్రిక్ టన్నుల బయో…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి నూకాలమ్మ జాతరలో జరిగిన హత్య, మరొకరిపై హత్యా ప్రయత్నం పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వివరాలు వెల్లడించారు. దేవరపు వీరస్వామి అనే వ్యక్తి జనసమూహంలో జాతర చూస్తుండగా నిందితులు కారుతో ఢీ కొట్టి అతని మరణానికి కారణం అయ్యారు. ఈ దాడిలో మౌనం శ్రీరామ్ కృష్ణ పై కూడా హత్యాయత్నం…

Read More

చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. -మాదే ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోందని, వైసిపి అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా మంగళవారం పేర్కొన్నారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్,…

Read More

క్షీరా రామంలో శంకర జయంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మండపంలో ఉన్న ఆది శంకరాచార్యుల విగ్రహం వద్ద ఉదయం మండపారాధన, అష్టోత్తరము పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన…

Read More

పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం.

హైదరాబాద్: ఏప్రిల్ 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగువారి అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రి వర్గాలు మంగళవారం విడుదల చేసిన వైద్య బులిటిన్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో సైనసైటిస్ (ముక్కు/సైనస్ సమస్య) కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు నిర్వహించిన “ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఎఫ్ ఇ ఎస్ ఎస్)”. ఇది ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోని సైనస్…

Read More

నా ఉద్యోగం పోయిందండి. -వెంకట్రామిరెడ్డి

అమరావతి: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని సోమవారం ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో సి సి ఏ నిబంధనకు వ్యతిరే కులు పనిచేసినందుకు ఎన్నికల సంఘం వారిని సస్పెండ్ చేసింది.గత ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటరామిరెడ్డి నిర్భయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వెంకట్రామిరెడ్డి ప్రవర్తన పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విచారణ అనంతరం వారిని సి సి ఏ…

Read More