Skip to main content

Telugu News Power

నేటి నుంచి మంగళగిరి లో 2 రోజుల తెలుగు మహోత్సవం.

మంగళగిరి: జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)తెలుగు మాతృభాష వైభవాన్ని, సాహిత్య సంపదను, కళా సంప్రదాయాలను, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం “తెలుగు మహోత్సవం” కార్యక్రమాన్ని ఈ నెల 25, 26, రెండు రోజులు గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది.ఈ మహోత్సవం అధికారిక గోడ పత్రికను రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి రాష్ట్ర సచివాలయంలో సంస్కృతిక శాఖామాత్యులు కందుల…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని…

Read More

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More

మారేడు దళములతో ప్రదక్షిణలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More