Skip to main content

Telugu News Power

చాంబర్స్ కళాశాలలో అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కామర్స్ డే సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓసూరి శ్రీదేవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎంబీఏ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, చాంబర్స్…

Read More

ఏ ఎస్ ఎన్ కళాశాల లో ప్రపంచ వెబ్ దినోత్సవం. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వెబ్ దినోత్సవం సందర్భంగా, స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం…

Read More

శక్తిశాట్ కు ఎంపికపై ప్రశంసల పరంపర. అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్న జెస్సి మేథస్సు.

రాజమహేంద్రవరం: జూలై, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కు చెందిన బాలిక కందుల జెస్సీకి ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను కలుసుకున్న జెసికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం ధవలేశ్వరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జెస్సి సాధించిన విజయం రాష్ట్రమంతటా,…

Read More

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు -ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం:జూలై, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జీవితంలో విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది జ్ఞానాన్ని అందించడమే కాక సమాజంలో మంచి స్థితిని, వ్యక్తిగత వికాసాన్ని ఇస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం రైతు బజార్ వెనుక ప్రభుత్వ బాలికల హాస్టల్ లోని 90 మంది విద్యార్థులకు ఆదివారం రగ్గులు, స్వేటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెసెస్ లను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఈ సందర్భంగా,…

Read More

మంత్రి దుర్గేష్ ను కలిసిన “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన జెస్సీ.

రాజమహేంద్రవరం: జూలై,26 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ఆమె తల్లిదండ్రులను, ఆదివారం రాజమహేంద్రవరంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెస్సీని శాలువాతో సత్కరించి, ఆమెకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి…

Read More

తల్లికి వందనం పధకం లో నియోజకవర్గాని కి రూ. 35 కోట్లు. -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2 ఏడాది కూడా క్రమం తప్పకుండా తల్లికి వందనం నిధులు వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం సందర్భంగా స్థానిక వీఆర్ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే లో ముఖ్యఅతిథిగా మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. ఈ…

Read More

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ 26 రోజుల సాగిన నిరాహార దీక్ష

న్యూఢిల్లీ, జూలై 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగించిన నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డా. జితేంద్ర సింగ్ సమక్షంలో గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించారు. వాంగ్‌చుక్ తన ప్రకటనలో, దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని హామీలు లభించడంతో దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్…

Read More

దొడ్డిపట్లలో మెగా పేరెంట్స్ సభ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వ్యాప్ ్యాప్తంగా శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే ఉత్సవం, ఆత్మీయ కలయిక కార్యక్రమంలో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జ ల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథి, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా శాఖ…

Read More

ఏ ఎస్ ఎన్ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం.

పాలకొల్లు:జూలై, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం బుధవారం నిర్వహించారు. కళాశాల జంతుశాస్త్ర (జువాలజీ) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మెదడు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, నిర్వహించారు. ఈ…

Read More