Telugu News Power

Blog

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి.

హైదరాబాద్: ఏప్రిల్, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) బుధవారం కన్నుమూశారు. వయో భారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు నాదెండ్ల చికిత్స తీసుకుంటున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి వీరికి వైద్య సేవలు అందించారు. వీరి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం వద్ద బంధువులు, అభిమానల సందర్శనార్థం ఉంచారు. పంజాగుట్ట స్మశాన వాటికలో…

Read More

గాయపడ్డ ఉపాధ్యాయునికి ఎమ్మెల్సీ పరామర్శ.

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం,లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కుక్కల వెంకట రాజా సురేష్ మంగళవారం లంకలకోడేరు రైల్వేస్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని, తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు.భగ్గేశ్వరం గ్రామం వంతెన వద్దకు వచ్చేసరికి పూర్వ విద్యార్థి దారికాచి, ఆకస్మాత్తుగా దాడి చేసి తలపై ఇనుపరాడ్ తో కొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కుక్కల వెంకట రాజా…

Read More

భద్రాచలంలో దర్శనాల రద్దు.

భద్రాచలం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) కళావాహన కార్యక్రమం సందర్భంగా, తెలంగాణలోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ నెల 26 ఆదివారం మధ్యాహ్నం గం.1.00 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనములు రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, కే. దామోదర్ రావు బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాచలం సీతారామ స్వామి వారి అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కళావాహన కార్యక్రమంలో,…

Read More

యుటిఎఫ్ సంఘం లోకి భారీగా చేరికలు.

గణపవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) యుటిఎఫ్ శాఖలోకి నూతనంగా సభ్యత్వాన్ని తీసుకొని పలువురు ఉపాధ్యాయులు బుధవారం సంఘంలో చేరారు. సభ్యులుగా చల్లా కృష్ణ ,గంగరాజు మాస్టర్,మాకా ప్రసాద్,నక్క రాంబాబు,మద్దాల జగన్నాథ స్వామి, గొర్రెల దుర్గా ప్రసాద్, సభ్యత్వం స్వీకరించారు. వీరికి స్వాగతం పలుకుతూ, గణపవరం మండల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ లో…

Read More

శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం.

భీమవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో బుధవారం ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం జరిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమం లో శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే…

Read More

జలవనురుల నిధులు రూ. 3 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ట, కొమ్ము చిక్కాల, కాపవరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అరట్లకట్టలో రూ. 50 లక్ష్యంతో సీసీ వాల్ నిర్మాణం, రూ. 20 లక్షలతో పైపు కల్వర్టు, గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్ముచిక్కాల లో రూ.75 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.31.29 లక్షలతో మరో సిసి వాళ్ళ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాపవరం…

Read More

పాలకొల్లుకు రూ. 5 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ కావాలి. కామ్) వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి ఆధునిక ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లులో ఏర్పాటు చేయనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, పట్టాభిపురం మంగళవారం పాలకొల్లులో ఎడ్ల బజారు వద్ద, సూర్య తేజ శివారుణ ఉన్న డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. వ్యర్ధాల నిర్వహణ ఎప్పటికీ చాలా వరకు పూర్తయిందని, ఇంకా 57,600 మెట్ ట్రిక్ టన్నుల బయో…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి నూకాలమ్మ జాతరలో జరిగిన హత్య, మరొకరిపై హత్యా ప్రయత్నం పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వివరాలు వెల్లడించారు. దేవరపు వీరస్వామి అనే వ్యక్తి జనసమూహంలో జాతర చూస్తుండగా నిందితులు కారుతో ఢీ కొట్టి అతని మరణానికి కారణం అయ్యారు. ఈ దాడిలో మౌనం శ్రీరామ్ కృష్ణ పై కూడా హత్యాయత్నం…

Read More

శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఏప్రిల్, 21 (తెలుగు మూవీస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, మార్చి 26 నుండి ఏప్రిల్ 8 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 4 వ సెమిస్టర్‌లో మొత్తం 197 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 192 మంది…

Read More

కంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమ

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎస్.ఎమ్. ప్రభుత్వ అటానమస్ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1,2, హెల్త్ కేర్ సెంటర్, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు పాలకొల్లు ఆర్.ఆర్. లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రై ఐ సిండ్రోమ్’ (కళ్లు ఆరిపోవడం) అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు…

Read More