పాలకొల్లు,డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు వారం రోజులు పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించారు. కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇచ్చారు. ఆంగ్లభాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ సన్నాహక నైపుణ్యాలు,విద్యార్థులు వివిధ యాక్టివిటీస్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారనీ ట్రైనర్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, కే భద్రాచలం, జి డి శ్రీనివాస్, రామలక్ష్మి, శిరీష, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.