పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం గణపతి హోమం జరిగింది. ఈ హోమంలో 13 మంది దంపతులు పూజలు నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న భక్తులచే పూజధికాలు చేయించారు.
ప్రతి సోమవారం సాయంత్రం స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న 7మారేడు దళముల మాడవీధుల ప్రదక్షణలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పుచ్చర్ల శ్రీనివాస్, సూపరిండెంట్ పి వాసు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
పంచారామ క్షేత్రం పాలకొల్లు లో ప్రత్యేక పూజలు.
పూజలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న భక్తలు