Telugu News Power

భక్తుల మారేడు దళ ప్రదక్షణ.

సప్త ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సప్త ప్రదర్శనలో సోమవారం సాయంత్రం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ఏడు మారేడు దళములతో, సప్త ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకులు క్రిష్టప్ప సప్త ప్రదక్షిణముల విశేష ఫలితములు గురించి భక్తులకు తెలియజేశారు. రాత్రి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.