యలమంచిలి:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్) అయ్యప్ప స్వామి మహా పడిపూజ యలమంచిలి స్థానిక పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శంకర్ పీఠం ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. యలమంచిలి నరేంద్ర శర్మ ,చివటపు హనుమంతరావు, కాసా పుష్ప శంకర్ గురు స్వాములు పూజలు జరిపించారు. అనంతరం చించినాడ రేపూరి పవన్ స్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు భవానీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. శివాలయం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఆడబాల శ్రీమన్నారాయణ,భక్తులు భారీ సంఖ్యలో ఈ పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు.
యలమంచిలి లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ.