భీమవరం: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు,
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ఆరాధ్య దైవం, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి, పాలకొల్లు మండలం, పూలపల్లి కి చెందిన మాదు మాణిక్యాలరావు శేషారత్నం దంపతులు సుమారు 90 వేల రూపాయల విలువైన,6 గ్రాముల బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, యు మీనాక్షి, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం,ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసారని,ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు.
శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారు కానుక.
అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తున్న దాతలు మాదు మాణిక్యాలరావు, శేషారత్నం దంపతులు.