ఏలూరు: జనవరి, 23(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి, ఎం శ్రీహరి, ఉపాధ్యాయ సమస్యలపై సానుకూలంగా స్పందించినట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. పిఎఫ్ రుణాల మంజూరు, సి ఎఫ్ ఎం ఎస్ కు వెంటనే పంపడం, మిస్సింగ్ క్రెడిట్, బ్యాలెన్స్ షీట్ ల విడుదల అంశాలపై శుక్రవారం యుటిఎఫ్ జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేశారు. దీనిపై సీఈఓ, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నాటికి బ్యాలెన్స్ షీట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపై వెంటనే తగు చర్యలు తీసుకుని, సత్వరమే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా యుటిఎఫ్ నాయకులు, రవికుమార్, రాజశేఖర్, పి శివప్రసాద్, జి రామకృష్ణ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీఈఓ హామీ
సీఈఓ కు వినతిపత్రం అందిస్తున్న యుటిఎఫ్ నాయకులు