పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.