Telugu News Power

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థులకు ‘టాటా’నియామక పత్రాలు

టాటా నియామక పత్రాలు అందుకున్న విద్యార్థులు

పాలకొల్లు: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు 20 మందికి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నియామక పత్రాలు అందజేసింది. వీరు వచ్చే ఏడాది,వచ్చే నెల 5న, బెంగళూరులో ఉన్న ఈ కంపెనీలో చేరవలసి ఉంది. విద్యార్థులు బిఎస్సి, బీకాం చివరి ఏడాది, 5వ సెమిస్టర్ చదువుతున్నారు. టాటా కంపెనీ 37 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 36 మంది నియామ పత్రాలు పొందారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు తన సంతోషాన్ని కాలేజీ కమిటీ సభ్యులతో పంచుకున్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులను చైర్మన్ కారుమూరి నరసింహారావు, ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, భావి టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులను అభినందించారు.