
https://youtube.com/shorts/3gKdSoz4jLo?si=KYdiVxlQkIuMBcjN
భారత్ పై భారీ సుంకాలతో విరుచుకు పడుతున్న ట్రంప్
దుర్మార్గపు సామ్రాజ్యవాద కాంక్ష పై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యలమంచిలి మండలం చించినాడ, ఏనుగువాని లంక, కట్టుపాలెం గ్రామకూడల్లలో ట్రంప్ దిష్టి బొమ్మ దహనం చేసి సోమవారం మధ్యాహ్నం ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. వాణిజ్య విలువల్ని తుంగలో త్రొక్కి, బెదిరింపు ధోరణిలో తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే ఒత్తిడి వల్ల భారత వ్యవసాయ రంగం పలుఒడిదుడుకుల పాలవుతుందన్నారు. కక్ష సాధింపు సుంకాలు బేషరతుగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీ పీ ఎం పార్టీ వివిధ శాఖల నాయకులు దేవ సుధాకర్, ఆంజనేయ స్వామి, బాతిరెడ్డి జార్జ్, తానేటి బాలరాజు, మాచవరపు సుబ్బారావు, వర్ల ఏడుకొండలు, మోహనరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

