
పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పేపర్. కాం) దివ్యాంగ శక్తి పథకం స్థానిక రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు బుధవారం ప్రారంభించారు. జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ ,కర్నేని గౌరవనీయుడు రోజా రమణి దంపతులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కాపర్తి, ఎర్రం శెట్టి పద్మారావు, తుల రామలింగేశ్వరరావు తదితర పలువురు కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

