రేపే ఎమ్మెల్సీ అభ్యర్థి బి. గోపి మూర్తి పరిచయ సభ.
భీమవరం:జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుత ఉపాధ్యాయ, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొ ర్రా గోపి మూర్తి, రెండవసారి పోటీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు భీమవరం,బ్యాంకు కాలనీ,శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభ్యర్థి పరిచయ సభ ఏర్పాటు చేసినట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. యూటీఎఫ్ నాయకులు, నాటి ఎమ్మెల్సీ షేక్ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా, జరిగిన ఉప ఎన్నికల్లో గోపి మూర్తి పోటీ చేసి ఘన విజయం సాధించారు….