పాలకొల్లు: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం, సాయంత్రం, సప్త ప్రదక్షిణాల్లోభాగంగా
మాడవీధులలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ,శ్రీ స్వామివారి పంచహారతుల సేవ నిర్వహించి నట్లు కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు.
పంచారామ క్షేత్ర మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.
సప్త ప్రదక్షిణలలో స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు