భీమవరం: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి వీరవాసరం కి చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు
మావుళ్ళమ్మ వారికి బంగారం కానుక.
అమ్మవారికి బంగారు కానుకగా సమర్పిస్తున్న కొట్టి కుటుంబ సభ్యులు