
యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా, 41 వ రోజు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు నిర్వహించారు. గ్రామోత్సవం లో 108 కలశములతో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దీపజ్యోతుల తో రాత్రి గ్రామంలో ఊరేగి, అమ్మ వారికి హారతులు సమర్పించారు.