Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణనిధికి రూ.55 వేల విరాళం.

బంగారం కానుక సమర్పిస్తున్న భక్తులు

భీమవరం: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి స్థానిక గన్నాబత్తుల వెంకట సోమేశ్వరరావు, సరోజిని దంపతులు సుమారు 55 వేలు విలవ చేసే 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ గురువారం తెలియచేసారు.