Telugu News Power

సి ఎస్ ఆర్ నిధులు పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ

రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ పాక సత్యనారాయణ

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించాలని, రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు బాగా సత్యనారాయణ కోరారు. రాజ్యసభలో, గురువారం ఈ మేరకు సూచన చేశారు. కంపెనీల చట్టం, 2013 ప్రకారం తమ లాభాల్లో 2శాతం వాటా సిఎస్ఆర్ నిధులకు కేటాయించవలసి ఉందన్నారు. ఈ మొత్తం,2023-2024 లో రూ.34, 908 లు ఉందన్నారు. ఈ నిధులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ ఏకతాటిపై నడవాలని సూచించారు.