ఇంజనీర్ల సంఘం ఏకగ్రీవ ఎన్నిక
పాలకొల్లు, నవంబర్14(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. కల్వకొలను దుర్గ రామస్వామి అధ్యక్షునిగా, జీవీఎస్ఎన్ స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా, డి.రాంబాబు ఉపాధ్యక్షుడిగా, బీ. కాలేశ్వర రావు, కోశాధికారిగా కె సత్య ఋషి,ఆర్గరైజింగ్ కార్యదర్శిగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక, సుబ్రమణ్యం రాజు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘసభ్యులు హాజరయ్యారు.