ఈ నెల 27నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం
ఈ నెల, 27నుంచి సార్వ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యఅతిథి ప్రసంగం చేసారు. రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లు ఉత్సవవిగ్రహాలుగా మిగిలి పోకుండా చైతన్య పరిచి వారి నిధులు వారే ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.రైతుల కోసం భూసార పరీక్షలు…