Telugu News Power

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్…

Read More

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత….

Read More

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి…

Read More

కాపు విద్యార్థుల ఉపకార వేతనం కొరకు దరఖాస్తులు.

పాలకొల్లు: జనవరి,2 (తెలుగు న్యూస్ పవర్) తులసి సీడ్స్ అధినేత, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు వారి సౌజన్యంతో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఏట అందిస్తున్నారు. ఈ ఏడాది, విద్యార్థుల నుంచి ఇందుకుగాను దరఖాస్తులు కోరుతున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం, స్థానిక కాపు కార్తీక్ వన సమారాధన కమిటీల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ల ఎంపిక జరుగుతుంది. విద్యార్థులు 75శాతం…

Read More

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో సాయికుమార్ ప్రతిభ

పాలకొల్లు: జనవరి, 2(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, డిసెంబర్,22- 28 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు, మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఈ క్యాంపు నిర్వహించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థి క్యాంపులో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరుపున, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి సాయికుమార్ కళాశాలకు గుర్తింపు తీసుకువచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థానానికి…

Read More

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.

Read More

నేడే సావిత్రిబాయి పూలే జయంతి జరపాలి.

పాలకొల్లు; జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) సావిత్రిబాయి పూలే,భారతదేశంలో మొట్టమొదటి, బడుగు బలహీన వర్గాల,మహిళా ఉద్యమ, ఉపాధ్యాయురాలు. ఈమె జయంతి శనివారం నిర్వహించాలని యు టి ఎఫ్ సంఘం ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది. సావిత్రిబాయి పూలే, చిత్రపటాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఈ పుట్టినరోజు జరిపేటప్పుడు పాఠశాల పని గంటలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంఘం సూచించింది. కార్యక్రమం నిర్వహించి, ఫోటోలు గ్రూపులో పెట్టాలని కోరింది.

Read More

కొత్త ఏడాదికి స్వాగతం.

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) ఆంగ్ల సంవత్సరాది ప్రారంభ రోజు, గురువారం ఉదయం నుంచి సెంటిమెంటుగా, దేవాలయాలు కుటుంబ సమేతంగా, పసిబిడ్డలతో సహా తరలి రావడంతో భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద, పండగ మొత్తం అక్కడే జరిగినట్టు, విభూది వేసిన రాలనంత మంది భక్తులతో మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు దర్శనం కోసం భక్తులు బారులుతీరి ఉన్నారు. దాదాపు 15 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు దేవాలయం వర్గాలు అభిప్రాయం వ్యక్తం…

Read More

కళ్యాణోత్సవ తొలి సమావేశం

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.

Read More

పెండ్యాల భవాని కి సత్కారం

పాలకొల్లు: జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి లో ధర్మకర్తగా పెండ్యాల భవాని నియమితులైనారు. ఈ సందర్భంగా, గురువారం, క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పినిశెట్టి చిన్న, ఉప్పులపు, భవానీని సత్కరించారు. అర్చకులు అనిల్, క్రిస్టప్ప, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, వీరబాబు, సోమేశ్వరరావు పలువురు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది…

Read More