అంతర్జాతీయ కళాకారుల సమ్మేళనంలో, ఆకట్టుకున్న ఉదయ్ చిత్ర ప్రదర్శన.
న్యూఢిల్లీ/పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) కళ,సంస్కృతిక పరస్పర మార్పిడి కార్యక్రమంలో భాగంగా, ఆర్త్ ఆర్ట్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో, న్యూఢిల్లీలో నిర్వహించబడుతున్న, “ఆర్ట్ డైవర్సిటీ-2026” చిత్రకళ ప్రదర్శనలో స్థానిక, అంతర్జాతీయ కళాకారులు, మార్లపూడి ఉదయ కుమార్ పాల్గొంటున్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్، జర్మనీ, వియత్నం, బ్రూనే, ఇండియా దేశాల నుంచి వందమంది చిత్రకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రదర్శనలో, ఉదయ్ కుమార్ చిత్రాలను, సాటి కళాకారులు వీక్షించి అభినందనలు తెలియజేశారు. చిత్ర రీతుల గురించి అడిగి తెలుసుకున్నారు….