Telugu News Power

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారికి భారీగా హుండి ఆదాయం.

భీమవరం: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి గురువారం లెక్కించారు. ఇప్పటివరకు గడిచిన 28 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.51,52,032. లు (అక్షరాలా యాభై ఒక్క లక్ష యాభై రెండువేల ముప్పై రెండు రూపాయలు) భక్తులు నగదు రూపంలో కానుకలుగా సమర్పించారు. బంగారం 33 గ్రాములు 240 మిల్లీగ్రాములు, వెండీ 189 గ్రాములు మరియు పలు దేశముల…

Read More

దివిస్ కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు:ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, లో జేకేసీ ప్లేసెమెంట్ సెల్ మరియు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10మంది విద్యార్థులు, ఉద్యోగాలకు ఎంపికయయ్యాలరు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యకు నైపుణ్యాలు జోడించినప్పుడే ఉపాధి…

Read More

పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. -ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) పరిశ్రమలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి మీడియా పాయింట్ వద్ద బుధవారం వంక మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి పట్ల ఆ సంస్థ మాజీ చైర్మన్ వంక రవీంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నుంచి కేవలం 20 శాతం మాత్రమే ఎంఎస్ ఎం లకు ప్రోత్సాహకాలు అందాయని వెల్లడించారు….

Read More

బూట్ క్యాంపుకు ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆధ్వర్యంలో ‘పీఎం-యూఎస్ హెచ్ఎ’ కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ నెల 22 నుంచి 5 రోజుల బూట్ క్యాంప్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలల నుండి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులను ఈ శిబిరానికి ఎంపిక చేశారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం…

Read More

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

యలమంచిలి:ఫిబ్రవరి,25 (తెలుగు న్యూస్ పవర్) కలెక్టర్ చదలవాడ నాగరాణి, బుధవారం మధ్యాహ్నం, స్థానిక మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాసవి పెనుగొండ, పోడూరు, యలమంచిలి తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, సమగ్ర కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పి-4 పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం 70 శాతం పూర్తయిన సర్వేను…

Read More

ఛాంబర్స్ విద్యార్థులు 14 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) జీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 58 మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఈ ఎంపికలు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.జీల్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ లు పి వెంకటరామన్ మరియు ఏ హేమభూషణ్లు మూడు రౌండ్లు రాత పరీక్ష ,…

Read More

ఉపాధి హామీ, 37 కరువు మండలాలకు, 50 రోజుల పొడిగింపు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి నన్ను సార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ లోని 37 కరువు మండలాలకు 50 రోజులపాటు ఉపాధి హామీ పథకం పొడిగించినట్టు బుధవారం తెలిపారు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు ప్రకాశం జిల్లాల కరువు ప్రభావిత 37 మండలాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి ఆమోదించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో అత్యంత సమయోచిత…

Read More

‘మళ్ళిన’ మృతికి ఘన నివాళి.

తణుకు: ఫిబ్రవరి, 25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త మళ్లీన రామచంద్రరావు, బుధవారం మృతి చెందారు. వీరు పారిశ్రామిక కుటుంబీకుల రెండవ తరానికి చెందిన వారు. స్వచ్ఛంద సంస్థ రోటరీ ప్రముఖులు. సాహిత్య రంగానికి మహారాజ పోషకులు. వీరి మృతికి, ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్మే ఆరమిల్లి రాధాకృష్ణ తదితర ప్రముఖులు నివాళులర్పించారు.

Read More

నేడే మావుళ్ళమ్మ వారి హుండీ లెక్కింపు.

భీమవరం: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీలిక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, బొండాడ నాగభూషణం, సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ జి. మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Read More

వరి పరిశోధన శాస్త్రవేత్తలతో కలెక్టర్ సమావేశం.

భీమవరం: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలతో, రైతు సాధికార ప్రతినిధులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, పకృతి వ్యవసాయ పద్ధతుల గురించి చర్చించారు. తక్కువ ఖర్చుతో వరి ఉత్పాదకత పెంచి, సాగు వల్ల రైతులు లాభపడే సమగ్ర వివరాలు శాస్త్రవేత్తలు అందించారు. ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పురోగతి విస్తరణ అవకాశాల గురించి చర్చించారు. కలెక్టర్ కు డి ఆర్…

Read More