Telugu News Power

దీపోత్సవం- భక్తి పారవశ్యం

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా…

Read More

కార్తీక వన సమారాధనలతో హోరెత్తిన పాలకొల్లు

కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణాన్ని హోరెత్తించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వివిధ సంఘాలవారు ఒకేరోజు ఈ కార్యక్రమాన్ని జరపడంతో పట్టణం సందడిగా మారింది.ఎక్కడ చూసినా ఆయా సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వారికి ఏర్పాటు చేసిన ఆటల్లో కేరింతలు కొడుతూ ఆనంద పడ్డారు. కొన్నిచోట్ల శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆడవారికి హౌసీ లక్కీ డిప్…

Read More

విద్యార్థులకు వరం పాలకొల్లు సైన్స్ సెంటర్

పాలకొల్లు: నవంబర్,16( తెలుగు న్యూస్ పవర్) చూసి తెలుసుకున్న దాని కంటే, చేసి నేర్చుకున్నది చిరకాలం గుర్తుండి పోతుందని ప్రముఖ వైద్యులు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ వెనుక ఉన్న అద్దె భవనంలో సైన్స్ సెంటర్ ఆదివారం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బాబ్జి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత సమాజానికి సైన్స్ అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా…

Read More

ఇంజనీర్ల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

పాలకొల్లు, నవంబర్14(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. కల్వకొలను దుర్గ రామస్వామి అధ్యక్షునిగా, జీవీఎస్ఎన్ స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా, డి.రాంబాబు ఉపాధ్యక్షుడిగా, బీ. కాలేశ్వర రావు, కోశాధికారిగా కె సత్య ఋషి,ఆర్గరైజింగ్ కార్యదర్శిగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక, సుబ్రమణ్యం రాజు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘసభ్యులు హాజరయ్యారు.

Read More

మంత్రి నిమ్మల మోటార్ సైకిల్ ర్యాలీ

పాలకొల్లు, నవంబర్ 14 ( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తెలుగుదేశం నూతనకమిటీల ఆవిర్భావ సభకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీ తో లంకలకోడేరు తరలి వెళ్లారు. పాముల రజిని కుమార్ మండల తెలుగుదేశం అధ్యక్షులుగా, ఇతర అనుబంధ విభాగాల సభ్యులు పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు…

Read More

టెన్నిస్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం

  పాలకొల్లు, నవంబర్ 14, (తెలుగు న్యూస్ పవర్) కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన, చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో టెన్నిస్ తో పాటు షటిల్ లాంటి క్రీడలు కూడా జాతీయస్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే షటిల్…

Read More

తుది పోరులో గెలిచేది ఎవరో ట్రోఫీతో నిలిచే విజేత ఎవరో

పాలకొల్లు, నవంబరు13, (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలు ముగింపు దశలో ఉన్నాయి. సెమీఫైనల్ పోటీలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి. విజేతల వివరాలు: 70 ఏళ్ల పైబడిన వారి సింగిల్స్ ఎస్. శెట్టు 6- 4,6- 4 వరుస సెట్లలో జీ.వి. సన్యాసి రాజు పై గెలుపొందారు. 70 ఏళ్ల పైబడిన డబుల్స్ విభాగాల్లో ఏ. రాంబాబు అండ్ సెట్టు…

Read More

కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడివిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ…

Read More

సీఎం సహాయ నిధి నుంచి 21 లక్షల చెక్కులు పంపిణీ

మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుంచి సత్వరం నిధులు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందాయన్నారు….

Read More

వందేమాతరం గీతంకి నేటికీ 150 ఏళ్లు

భారత జాతీయ గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం వందేమాతర గీతంతతో మారుమ్రోగిపోయింది. బక్కిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నాడు 35 కోట్ల ఆత్మగా విరాజిల్లుతూ, నేటి 150 కోట్ల మంది భారతీయుల సంగీత సంతకం సిగ్నేచర్ ట్యూన్ గా నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ధ్వనిస్తూ ఉంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్న ఈ గీతంతో పులకించని భారతీయ హృదయం ఉండదు. తెల్ల ముష్కరుల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన గుండెలను చీల్చితే,…

Read More