Telugu News Power

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు నియోజకవర్గం, ఏ మూల చూసినా సాంప్రదాయ శోభతో కళకళలాడింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా విద్యాసంస్థలు, చివరి రోజు అన్ని పాఠశాలలో,కళాశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చైర్మన్ కారుమూరి నరసింహ రావు భోగిమంట, వెలిగించి, సంబరాల ప్రారంభించారు. గరగనృత్యాలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, గాంధీ జీవిత చరిత్ర ప్రదర్శన, నాణేల ప్రదర్శన వంటి ప్రదర్శనలతో, చూసిన వారి అందరిలో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు…

Read More

ఘనంగా సంక్రాంతి సంబరాలకు శ్రీకారం

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గ పరిధిలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నుంచి వేగం పుంజుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీనివాస డీలక్స్ రోడ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ, పండగ పేరుతో, దుర్ వ్యసనాలకు, పాల్పడకుండా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు…

Read More

నంది వాహనంపై గ్రామోత్సవం

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి గ్రామోత్సవం సాయంత్రం మేళతాళాల, సంగీత వాయిద్యాలతో ఘనంగా జరిగింది. విగ్నేశ్వర పూజ స్థానిక క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం, ఏడు వారాల, మారేడు దళాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు విఘ్నేశ్వర స్వామి…

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More

భారతీయులు స్నేహపాత్రులు

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) భారతీయులు స్నేహపాత్రులని స్పెయిన్ యాత్రికులు కార్లోస్ ప్రశంసించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య నివాసంలో, ఆదివారం రాత్రి మాట్లాడారు. ఇక్కడ ప్రజలు విదేశీయుల పట్ల ఆసక్తి, గౌరవం చూపుతారని గమనించానన్నారు. వారిలో ఓపిక సహనం వంటి సుగుణాలు తనను ఆకర్షించాయన్నారు. కార్లోస్ (29) ప్రస్తుతం భారత యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర గత నెల 24న స్పెయిన్ లో ప్రారంభించారు. ఢిల్లీలో ఒక మోటార్ బైక్ అద్దెకు తీసుకుని…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

సంక్రాంతికి వస్తున్నాం, అయితే బరులు రెడీ, పందాలే తరువాయి

పాలకొల్లు:డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభమై వచ్చేనెల 14 వరకు కొనసాగుతూంది. ఆడపడుచు గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతాలు పలుకుతున్నారు. హరిదాసుల అప్డేటెడ్ వెర్షన్తతో ఖరీదైన ద్విచక్ర వాహనాల నెత్తిన అక్షయపాత్ర పెడుతున్నారు. ఒకప్పుడు హరిదాసులు సాంప్రదాయబద్ధంగా, తమకంఠ స్వరంతో పౌరాణిక గాధలు, తత్వాలు పాడేవారు, ఇప్పుడవి బ్లూటూత్ స్పీకర్లలో వినిపిస్తున్నారు. బుడబుక్కల వారు తెల్లవారుజామున మూడింటికి పల్లెల్లో ప్రవేశించేవారు. ఇప్పుడు డిగ్రీలు చదివిన బుడబుక్కల వారు అందరిలాగే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. ఇప్పటికే వారి…

Read More

స్వామి వారిని దర్శించుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి

పాలకొల్లు:డిసెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామిని శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ దంపతులు దర్శించి,పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో, శేష వస్త్రం బహుకరించి సత్కరించారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు

తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది….

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More