Skip to main content

Telugu News Power

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు వచ్చాయని సీజెపి అభిజీత్ దీప్కే ఆరోపణ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) బొద్ధింకల జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు బీజేపీలో చేరాలని బెదిరింపులు వచ్చాయని శుక్రవారం ఆరోపించారు. “మీకు, మీ కుటుంబానికి మేలు కావాలంటే బీజేపీలో చేరండి” అనే తరహా హెచ్చరికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై ఒత్తిడి తెచ్చే విధానమని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు యువత సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి,…

Read More

డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ, వైసిపి నిరసన ప్రదర్శన.

భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌…

Read More

“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం లో మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక లాకుల సమీపంలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, వార్డులోని ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మ తీరును తెలుసుకున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నట్టు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మహిళ తమ…

Read More

కేంద్ర మంత్రి తో, రాష్ట్ర మంత్రులు భేటి.

న్యూ ఢిల్లీ: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయం మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తోపాటు పలువురు ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి వర్మ వీరిని సత్కరించారు.

Read More

అంబరాన్నంటిన మండలి అభిమానుల సంబరాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం అవనిగడ్డ: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఇకనుంచి ప్రతి ఏటా ఆగస్టు 4వ తేదీ అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, మండలి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ప్రధాన కూడలిలో…

Read More

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం,…

Read More

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్…

Read More

జగనన్న సభ పర్యటన.

యలమంచిలి, జులై, 13( తెలుగు న్యూస్ పవర్.కామ్) జగనన్న ఈ నెల 15 న ఉదయం 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, సోమవారం మండల లోని,కాజా తూర్పు, కాజ పడమర, నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి , జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, మాజీ జడ్పీటీసీ గుబ్బల రామకృష్ణ, మాజీ…

Read More

ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా తాతాజీ.

పాలకొల్లు: జూన్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా నార్ని వెంకటసుబ్బారావు(తాతాజీ) నియమితులైయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణ బిజెపి నాయకులు తాతాజీకి శుభాకాంక్షలు తెలిపినట్టు భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ నాయకులు, పోడూరు మండల ఇంచార్జ్ జక్కంపూడి కుమార్ మంగళవారం తెలిపారు.

Read More

క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. -మంత్రి నిమ్మల ఆరోపణ.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, అసలు క్రెడిటే లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి నేరాలు ఘోరాలు చేయటంలో ఎంతో క్రెడిట్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే…

Read More