ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులు గా మిగిలిపోతారు. -మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కాం) మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం ప్రముఖ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కంటతడి పెట్టడం దేశానికి మంచిది కాదని, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయన్న భారతీయ సంస్కృతిని విస్మరించి, ఇండియా కూటమి…