Telugu News Power

వాస్తవ ఓటర్లను గుర్తించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ.

పాలకొల్లు: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వాస్తవ ఓటర్లను గుర్తించాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్ ఐ ఆర్ పై బిజెపి శ్రేణులకు ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల సవరణ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం…

Read More

రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధిస్తున్నారు. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు ఆరోపణ.

పాలకొల్లు: జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాజకీయంగా ఎదుర్కోలేక, తన వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాల పై గత పది రోజులుగా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, రాజకీయ కక్ష సాధింపులను జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, వైసిపి సీనియర్ నాయకులు మేకా శేషుబాబు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తనను, మహిళలను కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులను అవమాన పరచాలని, ఇబ్బంది పెట్టాలని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు….

Read More

మంచినీటి సమస్యకు మూలం వైసీపీ నిర్లక్ష్యం. -మంత్రి నిమ్మల మరోసారి ఆరోపణ.

పాలకొల్లు: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణ ప్రజల మంచినీటి కొరతకు మూలం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంత్రి మంగళవారం అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తాము ప్రతిపాదించిన విజ్జేశ్వరం నుంచి నేరుగా…

Read More

లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్.

అమరావతి: జూన్,9(తెలుగు న్యూస్ పవర్.కామ్)రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ శనివారం దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో, రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్…

Read More

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌తిరస్కరణ

భోపాల్: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్.కామ్) మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్, నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం తిరస్కరించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఒక న్యాయ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదనే అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు…

Read More

“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.

యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

Read More

రైతన్నగా మంత్రి రామన్న

పాలకొల్లు: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా కీర్తించబడే రైతు గా వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారిక విధులకు ఆదివారం విరామం కావడంతో, ఉదయాన్నే సైకిల్ పై బయలుదేరి తన స్వగ్రామం లో ఉన్న వ్యవసాయ, ఆక్వాక్షేత్రాలను మంత్రి పరిశీలించారు. రొయ్యల చెరువు వద్ద వాటి ఆరోగ్య పరిస్థితిని, పెరుగుదలను పరిశీలించారు….

Read More

పసుపు ప్రభంజనంతో అంగరంగ వైభవంగా టిడిపి మహానాడు పండుగ.

జనరల్ డెస్క్: మే, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రాజకీయ చరిత్రలో, పార్టీ ఆవిర్భవించిన, కేవలం 9 నెలల కాలంలో అధికార పీఠంపై నిలబెట్టిన, సంచలన నాయకుడు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే రెండు రూపాయల బియ్యం పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జననోత్సవం మే, 28 పురస్కరించుకొని ఏటా జరుపుకునే మహానాడు పండగ బుధవారం అంగరంగ వైభవంగా…

Read More

మహానాడు పసుపు పండుగగా విజయవంతం చేయాలి. -టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రి నిమ్మల పిలుపు.

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్). సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగల్లా టిడిపి ఆవిర్భావ దినోత్సవం మహానాడు పసుపు పండుగ ఘనంగా నిర్వహించాలని, టిడిపి శ్రేణులకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే,మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పిలుపునిచ్చారు. టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, యువగళం నేత నారా లోకేష్ బాబు మంత్రి నిమ్మల మహానాడు జరిగే ప్రదేశాలను సర్వాంగ సుందరంగా పసుపుమయంగా తీర్చిదిద్దారు. ఈనెల 27,…

Read More

జనసేన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

మంగళగిరి: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాష్ట్ర కమిటీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయన నివేదిక పార్టీ అధిష్టానానికి అందించవలసి ఉంది. ఈ కమిటీలో, కొణతాల రామకృష్ణ, (అనకాపల్లి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి),ఆరని శ్రీనివాసులు (తిరుపతి) పంతం నానాజీ (కాకినాడ గ్రామీణ), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) సామినేని ఉదయభాను, (ఎన్టీఆర్ జిల్లా)…

Read More