భీమవరం: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి లో
మహిళలకు సర్వికల్ క్యాన్సర్ (హెచ్ పి వి) నివారణకు కీలకమైన టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, స్థానిక జనసేన,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.
మహిళలు మరియు బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికలు 9 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు.క్యాన్సర్ నివారణలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పోలియో వ్యాక్సిన్లాగే ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
హెచ్ పి వి ఉచిత టీకా కార్యక్రమం.
ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత టీకా వేస్తున్న దృశ్యం.