కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలకు అర్హులు -కమిషనర్ విజయ సారథి
పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిష్టాత్మకంగా జరుప తలపెట్టిన సమీకృత కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ బి విజయ సారధి, గురువారం తన ఛాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే లో నమోదైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. సర్వే జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే ప్రారంభించినట్టు వెల్లడించారు. పట్టణంలో…