Telugu News Power

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్…

Read More

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత….

Read More

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.

Read More

కొత్త ఏడాదికి స్వాగతం.

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) ఆంగ్ల సంవత్సరాది ప్రారంభ రోజు, గురువారం ఉదయం నుంచి సెంటిమెంటుగా, దేవాలయాలు కుటుంబ సమేతంగా, పసిబిడ్డలతో సహా తరలి రావడంతో భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద, పండగ మొత్తం అక్కడే జరిగినట్టు, విభూది వేసిన రాలనంత మంది భక్తులతో మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు దర్శనం కోసం భక్తులు బారులుతీరి ఉన్నారు. దాదాపు 15 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు దేవాలయం వర్గాలు అభిప్రాయం వ్యక్తం…

Read More

పెండ్యాల భవాని కి సత్కారం

పాలకొల్లు: జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి లో ధర్మకర్తగా పెండ్యాల భవాని నియమితులైనారు. ఈ సందర్భంగా, గురువారం, క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పినిశెట్టి చిన్న, ఉప్పులపు, భవానీని సత్కరించారు. అర్చకులు అనిల్, క్రిస్టప్ప, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, వీరబాబు, సోమేశ్వరరావు పలువురు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది…

Read More

గత ఏడాదిపై ఓ విశ్లేషణ

పాలకొల్లు:డిసెంబర్,31(తెలుగు న్యూస్ పేపర్) రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఘర్షణ కొనసాగుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపుతూనే ఉంది. ఇజ్రాయిల్-గాజా సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై అస్థిరత మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. భారతదేశం దౌత్యపరంగా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే విదేశాల్లో ఉన్న భారతీయులను పలుదేశాలు తిప్పి పంపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా. అమెరికా వలసదారులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి తీరని మచ్చ గా మిగిలింది….

Read More

నూతన సంవత్సర కోలాహలం

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు సంబరపడ్డారు. నేడు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి, స్థానిక మిఠాయి దుకాణాల్లో ప్రజలు రద్దీగా కనిపించారు. ముగ్గులు, పూలు పళ్ళు అమ్మే దుకాణాల వద్ద సందడి కనపడింది. రోడ్డుపక్క ఏర్పాటు చేసిన బిర్యాని దుకాణాల వద్ద జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా పెనుమదం రోడ్డు, ఎడ్ల బజారు సెంటర్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఈ…

Read More

ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతర కృషి – చోడగిరి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) ఉద్యోగులు సంక్షేమం కోసం ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు తమ సమస్యలు సంఘ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీటిని సంఘం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ, 75 ఏళ్ల చరిత్ర…

Read More

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: డిసెంబర్, 31 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో, ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకల ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ప్రతిగా, అంబేద్కర్ విగ్రహాల పై నిర్మాణాలు పూర్తి చేయడానికి, ధన రూపంలో గాని, శ్రమదాన రూపంలోగాని ఇవ్వాలని, తన ఆలోచనగా తెలిపారు. గ్రామంలో నిరుపేద ఇంటి నిర్మాణానికి సహాయం…

Read More

జంగిల్ బుక్ సృష్టికర్త పుట్టినరోజు వేడుక

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రుద్యాడ్ కిప్లింగ్ సాహిత్యం యువతలో నైతిక విలువలు, దేశభక్తి,మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. జంగిల్ బుక్ సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత రుద్యార్డ్ కిప్లింగ్ జయంతి మంగళవారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, నోబుల్ బహుమతి తెచ్చి పెట్టిందన్నారు. జంగిల్ బుక్ పుస్తకంలోని పాత్రలు మానవ సహజ బలాలు, బలహీనతలు…

Read More