Telugu News Power

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

క్షీరారామ ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

పాలకొల్లు:డిసెంబర్23 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రం, స్థానిక శివాలయం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక అభిషేక మండపంలో అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నూతన కమిటీ ప్రధానంగా ఆలయ అభివృద్ధి గురించి విస్తృతంగా,ఈ సమావేశంలో చర్చించారు. ఆలయ అర్చకులు, అభిషేక పండితులు యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, క్రిస్టప్ప,అభిషేక పండిట్ సూరిబాబు, పర్యవేక్షకులు…

Read More

అంతర్జాతీయ కార్యదర్శిగా ‘ దర్శి’

పాలకొల్లు: డిసెంబర్, 22 (తెలుగు న్యూస్ పవర్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కార్యదర్శిగా పాలకొల్లు వ్యాపారవేత్త దరిశి శ్రీనివాస గుప్త నియమితులయ్యారు. హైదరాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో ఆదివారం ఈ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గుప్త అదే రో జు జరిగిన, ప్రమాణస్వీకారోత్సవంలో బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఏడాది నుంచి వీరి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1500 వాసవి క్లబ్ లు ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో 80 వేల వరకు సభ్యులు…

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది. స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు,మనిషి జీవితం ప్రతినిత్యం గణితంతో ముడిపడి ఉందని గణిత శాఖ హెచ్ ఓ డి డాక్టర్ జి సాయి బాబా పేర్కొన్నారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో సోమవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. తరువాత గణిత సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ,…

Read More

చాంబర్స్ లో క్రిస్మస్ సంబరాలు

పాలకొల్లు; డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాలతో జరిగాయి. విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. శాంతా క్లాస్ మధ్య మధ్యలో చాక్లెట్ బహుమతులు విసిరారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఏడాది చక్కని ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలను కొనియాడారు. పరమత సహనం పాటించాలన్నారు. కళాశాల కార్యదర్శి సీతారామరాజు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, డాక్టర్ మూర్తి, జానకి రామయ్య,…

Read More

గణిత మేధావి జయంతి ఉత్సవం

పాలకొల్లు: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు పైకి రావడానికి గణితం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం ప్రపంచ గణితమేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను, గణిత పరిశోధనలు విద్యార్థులకు వివరించారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే గణితలో ప్రతిభ తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ మేకింగ్ పోటీల్లో…

Read More

పోలియో ఆదివారం విజయవంతం

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పోలియో ఆదివారం సందర్భంగా పలుచోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద, దేశాలమ్మ గుడి వద్ద రోటరీ క్లబ్ పల్స్ పోలియో కేంద్రాలుఏర్పాటు చేసింది….

Read More

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి తన కార్యాలయం వద్ద స్వయంగా రక్తదానం చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వందల మంది అభిమానులు,…

Read More