శివ సహస్రనామ పూజ
స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.