ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.
పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…