ఉద్యోగుల 35 వేల కోట్ల బకాయిలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. -రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం డిమాండ్.
పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే, ఈ ఏడాది బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించవలసిన 35 వేల కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి, పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ ను కలిసి వేరువేరుగా వారికి వినతి పత్రాలు అందజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు, ప్రజా ప్రతినిధులకు…