భీమవరం: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. సుమారు, 59,25,412 నగదు, కానుకల ద్వారా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించుకున్నారు. బంగారం 45.100గ్రాముల, వెండి 210 గ్రాములు భక్తులు హుండీలో వేశారు. వివిధ విదేశీ కరెన్సీ నోట్లు అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.