Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ మయ నిధి ప్రత్యేక సమావేశం.

భీమవరం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణమయ నిధి ప్రత్యేక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. స్వర్ణమయ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేవస్థానం వద్ద 23 కేజీల బంగారం సిద్దముగా ఉన్నట్లు తెలిపారు. భక్తుల నుంచి మరో 27 కేజీలు బంగారం కానుకలుగా స్వీకరించి మొత్తం 50 కేజీలతో వివిధ అలంకరణ వస్తువులు తయారుచేయుటకు ప్రతిపాదించారు. స్థానిక శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ పులపర్తి…

Read More

సీఎం రాకపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో సీఎం సభ నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామ సభ,…

Read More

భీమవరంలో నూతన మల్టీపర్పస్ రెడ్ క్రాస్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారత రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ ప్రయోజనకర రెడ్ క్రాస్ నూతన భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం రాయలం గ్రామంలోని బ్లడ్ బ్యాంక్ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలికంగా సేవలు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో అధ్యాపకులకు శిక్షణా శిబిరం ప్రారంభం.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్., జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను,…

Read More

బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.

అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు,…

Read More

పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి దుర్గేష్.

విజయవాడ: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ప్రతీ చిత్రంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ‘పెద్ది’ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకొని, తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నట్టు…

Read More

వివాహిత కుమార్తెలకూ కారుణ్య నియామక హక్కు.. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:జూన్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల సమాన హక్కులకు బలమైన ఊతమిచ్చే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం చేసుకున్న కుమార్తెను కేవలం ఆమె వైవాహిక స్థితి ఆధారంగా కుటుంబ సభ్యురాలిగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కుటుంబంలోని ఆధారపడిన సభ్యురాలైతే, ఇతర అర్హతలు నెరవేర్చినట్లయితే వివాహిత కుమార్తె కూడా కారుణ్య నియామకం లేదా కారుణ్య ప్రాతిపదికన లభించే ప్రయోజనాలకు అర్హురాలేనని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం…

Read More

నూతన దంపతులు జ్యోతిర్లింగాల దర్శనం. చెప్పులు లేకుండా11,600 కి.మీ. నడక.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) మహారాష్ట్రకు చెంది నూతన జంట సనాత ధర్మానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వివాహం అనంతరం హనీమూన్ కు చెక్ చేయకుండా, తీర్థయాత్రల బాట పట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా సుదీర్ఘ పాదయాత్ర భక్త లోకాన్ని కదిలించింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు శివునిపై భక్తితో ఈ యాత్రను ప్రారంభించారు. సుమారు తొమ్మిది నెలల…

Read More

నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ యాత్ర ఎంతో మేలు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ సైకిల్ దినోత్సవం” జరుపుకుంటారు. సైకిల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణకు దాని పాత్రను చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో అధికారికంగా ప్రకటించింది. సైకిల్‌కు ప్రత్యేక గుర్తింపు: దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సైకిల్ ప్రపంచంలో అత్యంత సరళమైన, చౌకైన, విశ్వసనీయమైన రవాణా సాధనాల్లో ఒకటి. ఇంధనం అవసరం లేకుండా…

Read More

ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మీరు ప్రస్తుతం జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకొల్లు మండలం, పూలపల్లి వీరి స్వగ్రామం. గతంలో వీరు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సమావేశంలో రైతులు…

Read More