Telugu News Power

Telugu News Power

ముద్దాయికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక అరట్లకట్ట గ్రామానికి చెందిన ముద్దాయి మామిడి శెట్టి రమేష్ బాబు (27) కు కోర్టు ఐ.పి.సి లోని వివిధ సెక్షన్ల కింద 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్టు పాలకొల్లు గ్రామీణ పోలీసులు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కేసు సంబంధించి పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం 2022, జూన్ 16వ తేదీ రాత్రి నిందితుడు నేరం చేయాలనే ఉద్దేశంతో, నివాస గృహంలోకి చొరబడి, డిగ్రీ…

Read More

యలమంచిలి శిఖరాలు చేరిక

యలమంచిలి: డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న యలమంచిలి గ్రామ దేవత,శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పుణఃనిర్మాణం చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. నూతన దేవాలయ శిఖరం పై ఉంచవలసిన పంచలోహ శిఖరాలు శుక్రవారం వరకు యలమంచిలి చేరుకున్నాయి. వీటి బరువు 85 కేజీల 385 గ్రాములు. వీటిని తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి స్థానిక విష్ణాలయంలో…

Read More

జిల్లాకు 200 కొత్త పింఛన్లు

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లాకు కొత్తగా 200 పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వచ్చిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం ప్రకటించారు. ఇందువల్ల పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అర్హులైన, క్యాన్సర్ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స తీసుకుంటున్న వారు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ పింఛన్లు బాధితులకు సత్వరమే అందించడానికి నిబంధన సడలించారు….

Read More

యలమంచిలి శివాలయంలో మాస శివరాత్రి పూజలు.

యలమంచిలి:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) మాస శివరాత్రి సందర్భంగా, గురువారం యలమంచిలి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్, సుబ్రహ్మణ్యం ఈ పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కోడూరి రామలింగ జోషి కుటుంబ సభ్యులు, ,శ్రీరామచంద్రమూర్తి మనవరాలు విజయసాయి హరిప్రియ(బెంగళూరు) వారి అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. టిడిపి నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, సిద్ధాని రాము,ఒంటిపల్లి ప్రసాద్, కొడవటి సుబ్బరాజు, సత్య శ్రీనివాస్, బండారు…

Read More

యలమంచిలి మండలానికి 33 కైలాస వనాలు.

యలమంచిలి: డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో ఉన్న 32 గ్రామాలకు గాను 33 స్మశాన వాటికల అభివృద్ధి, సుందరీకరణకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిధులు మంజూరు చేయించినట్టు పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి తో యలమంచిలి స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకారణ గురించి చర్చించారు. స్మశాన వాటిక వద్ద గోదావరి కోతకు గురవతున్నందున…

Read More

యు.టి.ఎఫ్. టెట్ పై ధర్నా

భీమవరం:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,రాష్ట్ర సంఘం టెట్ పై ఇచ్చిన కార్యాచరణ పిలుపుమేరకు, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో ప్రాతినిధ్యం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు. 2. టెట్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఓడి మంజూరు చేయాలన్నారు.3. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే విడుదల చేయాలని 4. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల సెలవు సమస్య పరిష్కరించాలన్నారు.5….

Read More

వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

పాలకొల్లు:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని ప్రిన్సిపల్ టి. రాజా రాజేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ pసందర్భంగా,అధ్య క్షోపన్యాసం చేస్తూ, వినియోగదారుల రక్షణ కోసం 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మోసాలు, అక్రమాల గురించి, నాసిరకం సరుకులు,సేవలపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నదన్నారు. రిసోర్స్ పర్సన్ హాబీబ్ సుల్తాన్ ఆలీ తన ప్రసంగంలో చట్టం…

Read More

మెడ్ పాస్ రూ.999 ల చౌక హెల్త్ కార్డ్ విడుదల

పాలకొల్ల:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి వద్ద ఉన్న మెడ్ యునైటెడ్ ఆసుపత్రి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్డిఓ దాసిరాజు మెడ్ పాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య రక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నదని, అందుకే పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకొచ్చారన్నారు. అయితే ప్రస్తుత మెడ్ పాస్, ప్రజలందరికీ 999 రూపాయల అందుబాటు ధరలో ఉందని, ఇది…

Read More

డివిజన్ స్థాయి త్రో బాల్ పోటీల్లో యలమంచిలి విజేత

యలమంచిలి డిసెంబర్ 18 (తెలుగు న్యూస్ పవర్) డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. నరసాపురం,మొగల్తూరు పోడూరు,యలమంచిలి పాలకొల్లు మండలాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యలమంచిలి మండలంలో గురువారం ఈ పోటీలు జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడపాడు లో మహిళ క్రీడాకారుల త్రో బాల్ పోటీలు జరిగాయి. స్థానిక ఎంపీటీసీ సభ్యులు డేగల సూర్యకుమారి మాజీ సర్పంచ్ అడ్డాల వాసుదేవరావు క్రీడాపోటీలు ప్రారంభించారు. ఐదు మండలాల మహిళ క్రీడాకారులు పాల్గొన్న త్రోబాల్ పోటీల్లో…

Read More

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం…

Read More