Telugu News Power

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని…

Read More

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More

మారేడు దళములతో ప్రదక్షిణలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది…

Read More

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి, 28(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ కాశీగా పిలువబడే, నవ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన,డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది లో వేంచేసియున్న, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు, బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారు, దేవేరులథతో సమేతంగా, ఆంజనేయ స్వాముల వారి వాహనం పై మాడవీధులలో ఊరేగి،గ్రామోత్సవం నిర్వహించారు. పంచముఖలైన, ఆంజనేయులు, తూర్పున, ఆంజనేయముఖ రూపం, అభీష్ట సిద్ధికి, దక్షిణాన, నరసింహుని అవతారం, విజయానికి, పశ్చిమాన గరుడ…

Read More