విష్ణాలయంలో కార్తీక వన సమారాధన
యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.