Telugu News Power

విష్ణాలయంలో కార్తీక వన సమారాధన

యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.  

Read More

యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ

మండల కేంద్రంమైన యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ భక్తిశ్రద్ధలతో బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,అడబాల శ్రీమన్నారాయణ వారి ధర్మకర్తలు జోషి, రామదాసు, నాగేశ్వరరావు రవికుమార్, దుర్గారావు, శ్రీనివాస్, లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి, పాల్గొన్నారు.ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్,సుబ్రమణ్యం, ఋత్విక్కులు , పూజాదికాలు జరిపించారు. పలువురు భక్తులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన చిన్న, టీడీపీ నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, కొడవటి వరబాబు, కాస నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

పాలకొల్లు కు ఫిలిం ఇన్స్టిట్యూట్ #news #cinema #telugu #Palakollu

కళలకు పుట్టిల్లు పాలకొల్లు. పాలకొల్లు. కళాకారుల చిరకాల వాంఛ త్వరలోనే సాకారం కాబోతుంది. కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఏర్పాటు చేయబోయే ఫిలిం ఇన్స్టిట్యూట్ విశేషాలను వివరించారు. ఈ ఇన్స్టిట్యూట్ కు అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ గా నామకరణం చేశారు. తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యనిర్వాహక కమిటీలో గౌరవ సలహాదారుగా…

Read More

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

  కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ…

Read More

రంగుల హరివిల్లు,ఉరుములఘర్జన దీపావళి

 https://www.youtube.com/watch?v=U9mAg1KKoRg ఒక దేశం ఒక పండుగగా చెప్పుకొనే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. భారతీయులు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా తప్పక జరుపుకొనే దీపాల పండుగ. రాముడు యుద్ధంలో గెలిచి రావణ సంహారం తరువాత విజయోత్సవం, కృష్ణుడు నరకుని వధించి వచ్చిన శుభసందర్భంగా ఈ పండుగగాచెప్పబడింది. ఏమైనా చెడు పై మంచే విజయం సాధిస్తున్నదనే సందేశం దీపావళి. పిల్లలు, కొత్త అల్లుళ్ళు, యువకులు ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపాల పండుగ. పదోతరగతిలో పది మార్కులు తెచ్చే వ్యాసం,…

Read More