Skip to main content

Telugu News Power

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు.

యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు పెడితే మంచిదని భక్తుల నమ్మకం.