Telugu News Power

ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ

పాలకొల్లు: డిసెంబర్, 29(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఏరియా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపికయింది. గౌరవ అధ్యక్షులు పెచ్చెట్టి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంపిక జరిగింది. ఈ సంఘంలో 260 మంది సభ్యులుగా ఉన్నారు. కొత్త కమిటీ అధ్యక్షులుగా శీలం గంగాధర్ రావు, కార్యదర్శిగా వర్తినీడి దుర్గాప్రసాద్, కోశాధికారిగా చెల్లబోయిన యుగంధర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చిట్నీడి రామా వెంకట సత్య కుమార్ ఎంపికయ్యా. కార్యవర్గ సభ్యులుగా మరో…

Read More

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థులకు ‘టాటా’నియామక పత్రాలు

పాలకొల్లు: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు 20 మందికి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నియామక పత్రాలు అందజేసింది. వీరు వచ్చే ఏడాది,వచ్చే నెల 5న, బెంగళూరులో ఉన్న ఈ కంపెనీలో చేరవలసి ఉంది. విద్యార్థులు బిఎస్సి, బీకాం చివరి ఏడాది, 5వ సెమిస్టర్ చదువుతున్నారు. టాటా కంపెనీ 37 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 36 మంది నియామ పత్రాలు పొందారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు తన…

Read More

పెదమైనవానిలంకకు భారతదేశంలో రెండో స్థానం-కేంద్రమంత్రి నిర్మలా సీతారామమన్ వెల్లడి.

నరసాపురం: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో ఉన్న 700 జిల్లాల్లో పెదమైవానిలంక, నైపుణ్య శిక్షణ కేంద్రం రెండవ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, నిర్మల సీతారామ ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్గం జిల్లా మొదటి స్థానంలో నిలువగా, పెదమైనవానిలంక, విశ్వకర్మ శిక్షణ కేంద్రం రెండో స్థానం సాధించినందుకు తనుకు సంతోషంగా…

Read More

జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి ఏకగ్రీవం.

యలమంచిలి, డిసెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండలం, పెంటపాడు లో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పిఎస్ విజయరాజు జిల్లా అధ్యక్షులుగా, పి శివప్రసాద్ జిల్లా కోశాధికారి పదవులకు ఎంపికయ్యారు. ప్రస్తుతం క్రాంతి జిల్లా ఇంచార్జ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుటిఎఫ్ సంఘానికి వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక…

Read More

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా ముందు రోజు నుంచే చర్చిలు విద్యుత్ దీపకాంతులతో ఆకట్టుకున్నాయి.ఆరాధనలు, ఊరేగింపులు, బాలల నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ఆలాపన, సువార్త వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల క్రిస్మస్ కూటములు జరిగాయి. క్రైస్తవ భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును ఆరాధించారు. దేవుని తోటలో నాళం గుప్త,హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు కార్యక్రమం వేడుకల సందర్భంగా…

Read More

వాకర్స్ క్లబ్ ఆర్థిక సహాయం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ వారు పేద విద్యార్థులకు బుధవారం ఆర్థిక సహాయం అందించారు. స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విశ్వనాథం జానకి దేవి, కటకం శెట్టి దుర్గాభవానిలకు చేరో పదివేల రూపాయలు నగదు, రాజోలుకు చెందిన బోనం హాసిని అనే విద్యార్థికి ఏడు వేల రూపాయల ఔషధాలు అందించారు. వాకర్స్ క్లబ్ మానవత్వంతో తమకు సహాయం అందించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.

పాలకొల్లు:డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) చిన్న గ్రామాలపై కూడా, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక బల్లిపాడు గ్రామంలో 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న, అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తాగునీటి సరఫరాకు 68.80 లక్షలతో ప్రారంభం…

Read More

వినియోగదారుల వారోత్సవాలు ముగింపు.

పాలకొల్లు: డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్). స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల ముగింపు ఉత్సవాలు మంగళవారం జరిగాయి. ఈ వారోత్సవాలు ఈనెల 17న ప్రారంభమై 23 తో ముగిసాయి. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులు బాధ్యతలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులను ముంచెత్తుతున్న, కన్జ్యూమెరిజం నుంచి కొంతవరకు బయటపడవచ్చునన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ విభాగాలు విజేతలైన విద్యార్థులకు బహుమతులు…

Read More

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

క్షీరారామ ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

పాలకొల్లు:డిసెంబర్23 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రం, స్థానిక శివాలయం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక అభిషేక మండపంలో అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నూతన కమిటీ ప్రధానంగా ఆలయ అభివృద్ధి గురించి విస్తృతంగా,ఈ సమావేశంలో చర్చించారు. ఆలయ అర్చకులు, అభిషేక పండితులు యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, క్రిస్టప్ప,అభిషేక పండిట్ సూరిబాబు, పర్యవేక్షకులు…

Read More