Telugu News Power

క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లీలా కళ్యాణం

పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శిర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా,శనివారం రుద్ర హోమం జరిగింది. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. సాయంత్రం, కళ్యాణ మండపము నందు లీలా కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.   కళ్యాణం సందర్భంగా ప…

Read More

దేవుని పాట, జనం ఆట నేటి నుంచే సంక్రాంతి సంబరాలు

పాలకొల్లు: జనవరి,13(తెలుగు న్యూస్ పవర్) విశ్వవ్యాప్తమైన తెలుగువారి వారసత్వ సంపద, సంస్కృతీసంప్రదాయం. సంక్రాంతి పండగ శోభతోతో గాని అది సంపూర్ణం కాదు. అందుకే దేశ విదేశాల నుంచి ఆ పండుగ మూడు రోజుల కోసం, 365 రోజులు ఎదురు చూస్తుంటారు. బంధుమిత్రులతో ఇదే విషయంపై తరచూ చర్చించుకుంటూ ఉంటారు. గతేడాది సంబరాలు పంచిన ఆనందాన్ని ఇంకా మరచిపోక ముందే మరో సంక్రాంతి తెలుగుముంగిట వాలింది. ధనుర్మాసం గత నెల 16 నుంచి ప్రారంభమైంది. దీంతోపాటే హరిదాసులు, గంగిరెద్దులవారు…

Read More

కె ఏ ఎం జిమ్ బాడీ బిల్డింగ్ పోటీ విజేతలు వీరే.

పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కె ఏ ఎం జిమ్ ఆధ్వర్యంలో శరీర సౌష్టవ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ, టాక్సీ స్టాండ్ వద్ద, సోమవారం రాత్రి జరిగింది. విజేతలకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు బహుమతి ప్రధానం చేశారు. మిస్టర్ ఆంధ్ర ప్రథమ బహుమతి, విక్రమ్, రెండవ బహుమతి భాస్కర్, విశాఖపట్నం వారు అందుకున్నరు. ప్రశాంత్, మూడో స్థానం, మచిలీపట్నం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాజేష్,గుడాల గోపి,…

Read More

జంగిల్ బుక్ సృష్టికర్త పుట్టినరోజు వేడుక

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రుద్యాడ్ కిప్లింగ్ సాహిత్యం యువతలో నైతిక విలువలు, దేశభక్తి,మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. జంగిల్ బుక్ సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత రుద్యార్డ్ కిప్లింగ్ జయంతి మంగళవారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, నోబుల్ బహుమతి తెచ్చి పెట్టిందన్నారు. జంగిల్ బుక్ పుస్తకంలోని పాత్రలు మానవ సహజ బలాలు, బలహీనతలు…

Read More

బడుగుల ఆశాజ్యోతి రంగా -మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని రాష్ట్ర జలవన రుల శాఖామాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు. పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంగా కోసం ఒకప్పుడు ఎందరో నాయకులు ఎదురుచూసేవారన్నారు. కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి…

Read More

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా ముందు రోజు నుంచే చర్చిలు విద్యుత్ దీపకాంతులతో ఆకట్టుకున్నాయి.ఆరాధనలు, ఊరేగింపులు, బాలల నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ఆలాపన, సువార్త వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల క్రిస్మస్ కూటములు జరిగాయి. క్రైస్తవ భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును ఆరాధించారు. దేవుని తోటలో నాళం గుప్త,హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు కార్యక్రమం వేడుకల సందర్భంగా…

Read More

హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

నర్సాపురం, డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆకా సత్యనారాయణ తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నరసాపురం లేస్ పార్కు బుధవారం సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ముగింపు రోజున మంత్రి హాజరయ్యారు. మహిళలకు ఎంతో సహనం, సృజనాత్మకత ఉందని, వారు తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా కనపడుతుంది అన్నారు. ఈ విధంగా…

Read More

102 నాట్ అవుట్ పెన్షనర్ ఏటుకూరి కృష్ణమూర్తి

డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) గత102 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న కురువృద్ధులు ఏటుకూరి కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ఏటుకూరులో వీరు1923 లో జన్మించారు. ఏటుకూరి సీతారామయ్య లక్ష్మీబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 1948లో రెవెన్యూ శాఖలో 37 రూపాయల జీతానికి చేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వీరి మొదటి కార్య స్థానం. వీరు 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. గత 47 ఏళ్లుగా వీరు పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం 103వ ఏట అడుగు…

Read More

రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.

యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా…

Read More

తీరం చేరిన స్నేహ తిరునాళ్ళు

యలమంచిలి:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) భీమవరం సమీపంలో జక్రం రిసార్ట్స్లో శనివారం ప్రారంభమైన ‘స్నేహపీడనం’ సుమారు 24 గంటల పాటు కొనసాగి, నిమిషానికి 60 నవ్వుల వేగంతో యలమంచిలి మండలం, చించినాడ వశిష్ట గోదావరి వంతెనతాకి, సమీపములో సంతోషాల అల్లకల్లోలం సృష్టించి, దాదాపు సాయంత్రం వరకు కొనసాగి, తీరం దాటింది. ఈ స్నేహ తుఫానుకు “అమేజింగ్ రీ యూనియన్” గా నామకరణం చేశారు. సుమారు దశాబ్దం తర్వాత పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో 1979…

Read More