Telugu News Power

102 నాట్ అవుట్ పెన్షనర్ ఏటుకూరి కృష్ణమూర్తి

డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) గత102 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న కురువృద్ధులు ఏటుకూరి కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ఏటుకూరులో వీరు1923 లో జన్మించారు. ఏటుకూరి సీతారామయ్య లక్ష్మీబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 1948లో రెవెన్యూ శాఖలో 37 రూపాయల జీతానికి చేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వీరి మొదటి కార్య స్థానం. వీరు 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. గత 47 ఏళ్లుగా వీరు పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం 103వ ఏట అడుగు…

Read More

రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.

యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా…

Read More

తీరం చేరిన స్నేహ తిరునాళ్ళు

యలమంచిలి:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) భీమవరం సమీపంలో జక్రం రిసార్ట్స్లో శనివారం ప్రారంభమైన ‘స్నేహపీడనం’ సుమారు 24 గంటల పాటు కొనసాగి, నిమిషానికి 60 నవ్వుల వేగంతో యలమంచిలి మండలం, చించినాడ వశిష్ట గోదావరి వంతెనతాకి, సమీపములో సంతోషాల అల్లకల్లోలం సృష్టించి, దాదాపు సాయంత్రం వరకు కొనసాగి, తీరం దాటింది. ఈ స్నేహ తుఫానుకు “అమేజింగ్ రీ యూనియన్” గా నామకరణం చేశారు. సుమారు దశాబ్దం తర్వాత పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో 1979…

Read More

ఏపీ మంత్రుల పనితీరు ర్యాంకింగ్స్ విడుదల

93%తో అగ్రస్థానంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరుపై తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రజాభిప్రాయం, శాఖల పనితీరు, పాలనలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ ర్యాంకింగ్స్‌లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 93 శాతం పనితీరు స్కోర్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎన్. రామా నాయుడు (87%), సత్య కుమార్ యాదవ్ (86%) వరుసగా రెండో,…

Read More

వీఆర్ఏల చలో అమరావతి.

యలమంచిలి:డిసెంబర్,12 (తెలుగు న్యూస్ పవర్) తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ సహాయకులు చలో అమరావతి ఆందోళన చేపట్టారు. ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు అమరావతి చేరుకొని, నిరసన వ్యక్తం చేయనున్నట్లు యలమంచిలి మండల వీఆర్ఏల సంఘ అధ్యక్షులు కొమ్మిరెడ్డి రామకృష్ణ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం తెలిపారు. ఈ మేరకు వీఆర్ఏలు సంతకాలు సేకరించి తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ కు మెమోరాండం అందజేశారు. వి ఆర్ ఏ లు…

Read More

పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలి – వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి డిమాండ్.

పాలకొల్లు:డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడును వైఎస్ఆర్సిపి,పాలకొల్లు ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి,, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల తరలింపు ర్యాలీ పాలకొల్లు నుంచి భీమవరం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గుడాల గోపి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో…

Read More

అంతర్వేది లో సుదర్శన నరసింహ హోమం

సఖినేటిపల్లి: డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ అంతర్వేది నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సుదర్శన నరసింహ హోమం జరిగింది. ఈ హోమం చేయించుకుంటే,స్వామి వారి కంటే వేగంగా భక్తులను చేరుకునే సుదర్శన చక్రం, సకల ఈతి బాధలకు విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల యొక్క సత్ప్రవర్తనకు, ప్రశాంతతకు ఈ హోమం దోహదపడుతుందని పండితులు తెలిపారు. స్వామివారి ఆలయం చుట్టూ 9 సార్లు,9 వారములు ప్రదక్షిణలు చేసిన…

Read More

మానవ హక్కులను గౌరవించాలి

పాలకొల్లు డిసెంబర్ 10 తెలుగు న్యూస్ పవర్ ప్రతి ఒక్కరు మానవ హక్కులను గౌరవించాలని న్యాయవాది రాజా శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం స్థానిక ఏ సంఘం గవర్నమెంట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యు ఎన్ ఓ) డిక్లరేషన్ ద్వారా లభించిన మానవ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. ఇది అందరి బాధ్యతని తెలిపారు. ఇదే సందర్భంలో పౌరులు తమ బాధ్యతలను కూడా గుర్తు ఎరగాలని విజ్ఞప్తి…

Read More

పాలకొల్లు దుఃఖదాయని దమ్మయపర్తి మురుగు నుంచి విముక్తి.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి…

Read More

క్షీరా రామలింగేశ్వర ఆలయంలో విఘ్నేశ్వర పూజ.

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పవర్ వారం వారం జరుగుతున్న సప్త మారేడు దళముల ప్రదక్షణలు పూర్తి చేసుకున్న 15 మంది భక్త దంపతులు విగ్నేశ్వర పూజలో పాల్గొన్నారు. శివ సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More