Telugu News Power

Blog

మావుళ్ళమ్మ వారి ఆలయం మంగళవారం మూసివేత.

భీమవరం: సూపర్వైజర్,28(తెలుగు న్యూస్ పవర్) ఈ నెల, 3 న, అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండి సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వెల్లడించారు. ఆ రోజు మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఉదయం, ప్రాతః కాల…

Read More

ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…

Read More

రైల్వే రిజర్వ్ టికెట్ వేరొకరికి ఇవ్వొచ్చు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి27 (తెలుగు న్యూస్ పవర్) భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు ప్రకటించింది. ఒకరి పేరుపై రిజర్వ్ చేసుకున్న టిక్కెట్టును వేరొకరి పేరుకు మార్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇది రక్తసంబంధీకులైన, తల్లిదండ్రులు, సోదర,సోదరి, కొడుకు,కూతురు, భార్యాభర్తలకు కు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. ఒకరోజు ముందు రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి, సంబంధిత రుజులులు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివాహాది శుభకార్యాలకు వెళ్లే బృందాలకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేస్తారని రైల్వే శాఖ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ…

Read More

నేడే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉచిత టీకా.

అమరావతి: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) బాలికల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా టీకా వేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభిస్తారు. బాలికలు యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఈ వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్యాన్సర్ ముప్పు 14 -15 ఏళ్ల మధ్య బాలికలకు ఎక్కువగా పొంచి ఉంది. ఇందుకుగాను హెచ్ పి వి టీకా వేసే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ…

Read More

మావుళ్ళమ్మ ఆలయ సిబ్బంది నూతన కార్యవర్గం ఏర్పాటు.

భీమవరం: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది యూనియన్, రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గంఇటీవల ఏర్పాటయ్యింది. నూతన కార్యవర్గము: 1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు 2. ⁠నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు 3. ⁠పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి 4. ⁠తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి 5. ⁠కడలీ అనంతరావు, కోశాధికారి 6. ⁠కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి 7. ⁠కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు…

Read More

కనుల పండుగగా కనకదుర్గమ్మ కళ్యాణం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చిట్టి సాయి కుమార్,ఈశ్వరి దంపతులు, కల్యాణోత్సవం జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, తులా రామలింగేశ్వరరావు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు…

Read More

గ్రామ గ్రామానికి వైద్యం.

పాలకొల్లు:ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) గ్రామ గ్రామానికి వచ్చే,సంచార చికిత్స కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డాక్టర్ ఎం నవ్య జీవన్ కోరారు. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరం సచివాలయం వాలమర్రు గ్రామంలో సంచార చికిత్స శిబిరాన్ని డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ, ఈ క్యాంపు నందు బీపీ. షుగర్ ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకు సలహాలు…

Read More

మండలి ఛైర్మన్ పై జగన్ ఆగ్రహం!?

అమరావతి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తడు, ఇష్టుడు అయినా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు మధ్య విభేదాలు తలెత్తయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ హోదాలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలకు తాను అనుకున్న విధంగా అవకాశం కల్పించడం లేదని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. శాసన సభలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వున్నట్లే, శాసన మండలిలో వైకాపాకు ఆధిక్యత వుంది. ఈ అవకాశాన్ని వాడుకొని, కూటమి ప్రభుత్వాన్ని…

Read More

అంగరంగ వైభవంగా మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా గురువారం రాత్రి జరిగింది. దాదాపు పది రకాల వివిధ ఈవెంట్లతో జాతర భారీగా సాగింది. గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్లతో జాతర జరగలేదు. అమ్మవారిని అలంకరించిన హంస వాహనంపై జాతర గ్రామోత్సవంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఆలయం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారు కనపడి,ఈ జాతర అమ్మవారికి సంబంధించిన…

Read More