Telugu News Power

Blog

చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. -మాదే ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోందని, వైసిపి అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా మంగళవారం పేర్కొన్నారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్,…

Read More

క్షీరా రామంలో శంకర జయంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మండపంలో ఉన్న ఆది శంకరాచార్యుల విగ్రహం వద్ద ఉదయం మండపారాధన, అష్టోత్తరము పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన…

Read More

పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం.

హైదరాబాద్: ఏప్రిల్ 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగువారి అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రి వర్గాలు మంగళవారం విడుదల చేసిన వైద్య బులిటిన్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో సైనసైటిస్ (ముక్కు/సైనస్ సమస్య) కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు నిర్వహించిన “ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఎఫ్ ఇ ఎస్ ఎస్)”. ఇది ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోని సైనస్…

Read More

పెదపేట రామాలయానికి ఆకివీడు నగరపాలక సంస్థ ఆమోదముద్ర.

ఆకివీడు: ఏప్రిల్ ,21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెదపేట లో రామాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి మంగళవారం తొలి అడుగు పడింది. స్థానిక నగర పంచాయతీ వారు ఆలయ నిర్మాణానికి అవసరమైన తీర్మానం ఆమోదించారు. నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు 20 మందిలో 19 మంది తీర్మానాన్ని ఆమోదించారు. కౌన్సిలర్ జోష్న ఒక్కరే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కౌన్సిల్లో…

Read More

నా ఉద్యోగం పోయిందండి. -వెంకట్రామిరెడ్డి

అమరావతి: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని సోమవారం ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో సి సి ఏ నిబంధనకు వ్యతిరే కులు పనిచేసినందుకు ఎన్నికల సంఘం వారిని సస్పెండ్ చేసింది.గత ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటరామిరెడ్డి నిర్భయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వెంకట్రామిరెడ్డి ప్రవర్తన పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విచారణ అనంతరం వారిని సి సి ఏ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక దళం గతవారం రోజులగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం ముగిసింది. జిల్లా అగ్నిమాపకదళ సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు సభలో తహసిల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపకదళం ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖ నం పోటీల్లో పాల్గొన్న వారికి…

Read More

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.

పాలకొల్లు: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్ కం) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మహత్యం నిమ్మల రామానాయుడు సూచన మేరకు వారికి క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బంగారం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు పౌండేషన్ ద్వారా పేదలకు దివ్యాంగులకు బియ్యం దుప్పట్లు పంపిణీ…

Read More

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరును పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు76వ జన్మదినోత్సవము సందర్భంగ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారు పార్వతి అమ్మవార్ల పెద్ద పూజలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మరియు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో బృహత్తర మైన కార్యక్రమంలు చేపట్టాలని శ్రీ స్వామి వారికి పూజలు జరిపించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

క్షీరా రామంలో జనసేన నాయకుల పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని పాలకొల్లు జనసేన పార్టీ తరఫున శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుతూ పంచారామ క్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద గోత్రనామాలుతో అర్చన జరిగింది . ఈ కార్యక్రమంలో పాలకొల్లు టౌన్ జనసేన పార్టీ నాయకులు పెదకూర…

Read More

జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

జపాన్: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.53 గంటల సమయంలో ఉత్తర జపాన్‌లోని సాంరికు/ఇవాటే తీర సమీపంలో భూమి కంపించినట్లు నివేదికలు తెలిపాయి. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు…

Read More