Telugu News Power

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల పంపిణీ

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు…

Read More

విద్యార్థులు సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి-ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి

యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ…

Read More

నూతన చట్టాలు తెలుసుకోవాలి

పాలకొల్లు:డిసెంబరు,1(తెలుగు న్యూస్ పవర్) భారతీయ న్యాయ సంహిత చట్టాల గురించి తెలుసుకోవాలని పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి పృద్వి పిలుపునిచ్చారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భారతీయ నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పృథ్వి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో…

Read More

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్…

Read More

ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ…

Read More

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

యలమంచిలి, నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడవిపాలెం ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ విద్యార్థులు ఏడు రోజుల ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ నిర్వహణలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైసా అధ్యక్షులు చెరుకూరి…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల ఉచిత పంపిణి.

యమంచిలి: నవంబర్ 29 తెలుగు న్యూస్ పవర్ మండలంలో ఉన్న 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు యుటిఎఫ్ టెక్స్ట్ పేపర్లు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఏ శ్రీవాణి కె.వి.ఆర్.రామకృష్ణంరాజులు ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ, దిగమర్తి రాంబాబు, రామేశ్వరపు సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు మామిడి శెట్టి…

Read More

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More