అమరజీవికి నివాళి
పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) అమరజీవి,భాష ప్రయుక్త రాష్ట్రాల సృష్టికర్త పొట్టి శ్రీరాములు వర్ధంతి సోమవారం జరిగింది. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు చరిత్ర శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన శరీరం క్రిములకు ఆహారమైపోయినా, లెక్కచేయక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు….