Telugu News Power

9వ తరగతికి,మార్చి 12 నుంచి పదవ తరగతి పాఠాలు.

అమరావతి: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలోని అన్ని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్యాసంబంధ విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చలు ఫలించి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, మార్చి 12 నుంచి 10వ తరగతి పాఠాలు నేర్పించడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నో…

Read More

ఎస్ఎఫ్ఐ రక్తదాన శిబిరం.

పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం…

Read More

జల సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటి.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో నీటి సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటీ శనివారం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా, భౌతిక శాస్త్ర విభాగం ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతతో జలవనురుల సంరక్షణపై వేసిన చిత్రాలు ఆకట్టుకుని,ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, టి కృష్ణ, బి రమేష్ కుమార్, బి రామలక్ష్మి, సుబ్బరాయన్, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులకు…

Read More

సైబర్ భద్రత పై చాంబర్స్ కళాశాలలో ముగిసిన శిక్షణ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

ఇద్దరమ్మాయిలు కు గ్రూప్-2 లో విజయం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు వాస్తవ్యులు, గురుజు దివాకర్, కుమార్తె లక్ష్మీ అంజన, గ్రూప్-2 పోటీ పరీక్షలో విజయం సాధించారు. ఈమె, పోలీస్ శాఖలో డి.ఎస్.పి ఉద్యోగానికి ఎంపికయ్యా. ప్రస్తుతం వీరు పాలకొల్లులో ఉంటున్నారు. తండ్రి దివాకర్, భీమవరం సి ఐ కార్యాలయంలో రైటర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి హేమలత ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు. ఈమె తాతగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసారు. ఈ సందర్భంగా, పెదనాన్న, ఈనాడు మాజీ…

Read More

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల

విజయవాడ: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి పరీక్ష తేదీలు మార్పులు చేశారు. మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు టైం టేబుల్ మార్చి, 16 – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) మార్చ్,18, – హిందీ (సెకండ్ లాంగ్వేజ్) మార్చ్ ,20 – ఇంగ్లీష్ మార్చి, 23…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో వంటలు ప్రదర్శన.

పాలకొల్లు: జనవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ కళాశాలలో, సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, గురువారం సాంప్రదాయ వంటకాల ప్రదర్శన జరిగింది. కళాశాల సాంస్కృతిక విభాగం ఈ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు, కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, చిన్న గోపురం చైర్మన్, రేపాక ప్రవీణ్ భాను, డాక్టర్ సిరిగినీడి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ, టి కృష్ణ, బూసి వెంకటస్వామి, ఆశ…

Read More

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు….

Read More